Committees

   Hyderabad State/Andhra Pradesh 

    State Committees and Commissions

    (1937–2014)

 హైదరాబాద్  రాష్ట్రము / ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము

యొక్క కమిటీలు  ( 1937 నుండి 2014 వరకు )

Committees and Commissions


పరిచయం


హైదరాబాద్  రాష్ట్రము / ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క కమిటీలు

1). బహాదూర్  అరవముదం అయ్యంగార్ కమిటీ (1937) 

ఈ కమిటీ ని హైదరాబాద్ రాజ్యంలోని 7వ నిజాం మీర్  ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యం లోని రాజ్యాంగ సంస్కరణము ల  కొరకు నియమించారు. 

నివేదిక :-     ముల్కి నిబంధనలు మరియు ఉద్యోగ నియామకాలు  

                     ముఖ్యమైనవి :- ఉద్యోగాలు మరియు పాలనాపరమైన అంశాలు. 

2). ఎం. ఎస్. భరుచ కమిటీ (1939)( భూ సంస్కరణలకొరకు )   

భూమి సాగు పరిస్థితులు, కౌలు దారుల స్థితిగతులు అధ్యయనం చేయటానికి ఈ కమిటీని నిజాం పరిపాలనలో భాగముగా నియమించటం జరిగింది.

3). ఎస్. కె . థార్ కమిటీ  ( 1948) 

భారత ప్రధాన మంత్రి  జవహర్లాల్ నెహ్రు ఆధ్వర్యంలో ( రాజ్యాంగ సభ ) ఎస్ . కె.  థార్ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ ప్రధాన అధ్యయనం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు 1948 జూన్ నెలలో నియమించారు.


4 గురు  సభ్యుల కమిటీ 


అధ్యక్షులు గా   ఎస్. కె, థార్ 

సభ్యులు :- 1).  బి.సి. బెనర్జీ   2). జగత్ నారాయణ్హా లాల్  3). డాక్టర్ పన్నాలాల్ 

వీరు అధ్యయనం చేసి భాషా ఆధారముగా రాష్ట్రములు ఏర్పాటు చేయవద్దని చెప్పినారు.

4). జె.వి.పి. కమిటీ (1948)

జవహర్ లాల్ నెహ్రు , వల్లభాయ్ పటేల్, పట్టాభిసీతారామయ్య  ముగ్గురు సభ్యుల కమిటీ  ఎస్. కె. థార్ కమిటీ ని పరిశీలించటానికి ఏర్పడ్డది. 


సభ్యులు :-  జవహర్ లాల్ నెహ్రు ( ప్రధాన మంత్రి )

                      వల్లభాయ్ పటేల్   ( హోమ్ మంత్రి )

                       భోగరాజు పట్టాభి శీతారామయ్య 

భాషా ఆధారముగా రాష్ట్రాల ఏర్పాటును కొంతకాలము పాటు నిలిపివేయాలనితేల్చినారు.

5). పండిట్ సుందర్ లాల్  కమిటీ (1949 నవంబరు 29) 

*కమ్యూనిస్టులు, ముస్లింలపై జరిగిన దాడులవల్ల ఉత్పన్న మైన పరిస్థితులు, స్థితిగతులు 

అధ్యయనం చేయటానికి ఈ కమిటీని నియమించారు. ( ఈ కమిటీ నివేదిక బహిర్గతం చేయలేదు)

6). ఎ. డి. గోర్వాలా  కమిటీ (1950)

ఎంకే. వెల్లోడి  పౌర పరిపాలనలో భాగముగా   హైదరాబాద్ రాష్ట్రములో ఆర్థిక పరిస్థితి మరియు  అభివృద్ధిని  మెరుగు పరచటానికి ఈ కమిటీ ని నియమించారు.

7). పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ( 1952)

1952 లో జరిగిన ముల్కి ఉద్యమం లో భాగముగా సిటీ కాలేజీ ఆవరణలో జరిగిన పోలీస్ కాల్పులఫై ఉత్పన్న మైన పరిస్థితులను అధ్యనం చేయటానికి 1952 సెప్టెంబర్ 09 న ఈ కమిటీని నియమించారు. 

ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటంటే పోలీస్   సిబ్బంది నిర్లక్ష్యం వల్లనేకాల్పులు జరిగాయని తేల్చిచెప్పింది. 

8). జస్టిస్ వాంచూ కమిటీ (1953)

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమును ఏర్పాటు చేస్తే ఉత్పన్నమైయ్యే సమస్యలు, ఆర్థిక సమస్యలు మొదలైన వాటిని అధ్యనం చేయటానికి  ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.


ముగ్గురు 03 సభ్యులు 


1. ఆద్యక్షులు :-   కె. ఎన్. వాంచూ 

   సభ్యులు :-       ఎం. పి. సెతల్వాడ్          

                              నిరేన్ డే 

ప్రస్తుతం కొనసాగుతున్న మద్రాస్ ను ఉమ్మడి రాజధానిగా 4 సంవత్సరాలు ఉండాలని 

నివేదిక ఇచ్చారు.

9). ఫజల్ అలీ కమిషన్ (1953 డిసెంబర్ 29)

(రాష్ట్రాల పునర్విభజన కోసం )

శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన కోసం ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం 

నియమించింది.  


ముగ్గురు 03 సభ్యులు :-     అధ్యక్షులు :- ఫజల్ అలీ 

సభ్యులు                           1. కే. ఎమ్. ఫనిక్కర్  

                                       2. హృదయనాథ్ కుంజ్రూ .

10). తెలంగాణ ప్రాంతీయ కమిటీ  (1958) TRC 

కె . అచ్యుతారెడ్డి అధ్యక్షతన మొట్టమొదట పెద్దమనుష్యులా ఒప్పందంలో భాగముగా 

1958 లో తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసారు. తర్వాత దీన్ని పట్టించుకోలేదు

అధ్యక్షులు వరుసగా  అచ్యుత్ రెడ్డి, హయగ్రీవ చారి , చొక్కారావు , కోదాటి రాయమల్లు  తదితరులు .

ఆరు సూత్రాల పథకం ద్వారా 1973 సెప్టెంబర్ 21 రోజున రద్దు చేయబడింది.

11). కుమార్ లలిత్ కమిటీ (1958 జనవరి 23)

అఖిల పక్ష సమావేశములో నిర్ణయించిన తీర్మానం మేరకు అక్రమముగా పనిచేస్తున్న 

ఆంధ్ర ఉద్యోగుల వివరాలు మరియు తెలంగాణ మిగులు నిధులు తెలుసుకోవటానికి, ఈ 

కమిటీని నియమించారు.  మిగులు నిధులు 34.10 crores. 

12). జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ  (1969 ఏప్రిల్ 22)

తెలంగాణలోని మిగులు నిధులను తేల్చటానికి ఈ కమిటీని నియమించారు. 


నల్గురు 04  సభ్యులు :-     మిగులు నిధులు : 28.34 crores.  


అధ్యక్షులు :-  జస్టిస్ వశిష్ఠ భార్గవ 

 సభ్యులు :- 1. టి. ఎన్. కృష్ణ స్వామి  

                     2. ఎం.వి. మాథుర్  

                     3. హరి భూషణ్ భార్ 

     

13). జస్టిస్ వాంచూ కమిటీ (1969)

ముల్కి నిబంధనలు- రాజ్యాంగ సవరణ  అనే అంశాలపై సూచనలు చేయటానికి ఈ 

కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమిచ్చినది. ముల్కి నిబంధనలు ఫై రాజ్యాంగ సవరణ కు 

సాధ్యం కాదని తేల్చిచెప్పినది. 

14). తార్కుండే కమిటీ (1977 ఏప్రిల్ )

నక్సలైట్లపై జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ల  ఫై విచారణ చేయటానికి ఈ కమిటీని రాష్ట్ర 

ప్రభుత్వం నియమించింది.


సభ్యులు :-      కె.జి. కన్నబిరన్     

                          అరుణ్ శౌరి 

                         కృష్ణ చౌదరి 

                        కాళోజి నారాయణ్ రావు 

ఇదే అంశం ఫై జులై 1977 న భార్గవ్ కమిషన్ ను ప్రభుత్వం నియమించింది.

15). జయ భారత్ రెడ్డి కమిటీ ( ఆపీసర్స్ కమిటీ )  1984 

ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎన్  .జి. ఓ సంఘం చేసిన వినతికి స్పందించిన ఎన్టీఆర్ ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఈ కమిటీని నియమించారు.


కమిటీ అధ్యక్షులు              జయ భారత్ రెడ్డి 

సభ్యులు                            ఉమాపతి ,      

                                        అమర్ నాథ్ 


వీరు  36 పేజీల నివేదిక ఇస్తూ 58,962 మంది స్థానికేతరులు అక్రమముగా ఉద్యోగాలు 

పొందారని తెలిపారు.

16). సుందరేశన్ కమిటీ (1985)

ఎన్టీఆర్ ప్రభుత్వం జయ భారత్ రెడ్డి కమిటీ నివేదికలోని అంశాలను పరిశీలించటానికి ఈ కమిటీని నియమించింది. 

17). సుబ్రహ్మణ్యం కమిటీ (1995)

ప్రభుత్వ రంగ సంస్థలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కమిటీని నియమించారు.

18). హితన్ భయ్యా కమిటీ (1998)

విద్యుత్ రంగంలో సంస్కరణల కొరకు ఈ కమిటీ చంద్రబాబు నాయుడు   నియమించారు.

19). జి. ఎమ్. గిర్ గ్లాని  కమిటీ  (2001 జూన్ 25 )

610 జి. వో .  అమలును పరిశీలించటానికి నారా చంద్రబాబు నాయుడు ఈ ఏక సభ్య కమిటీని నియమించారు. 


ఈ కమిటీ నివేదిక ఫై  పలు కమిటీలు వేసినారు.

20). ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2005, మార్చి )

తెలంగాణాలో జరుగుతున్నా ఉద్యమాలను ఆపటానికి, సంప్రదింపులు మరియు  విస్తృత చర్చలు కొరకు ఈ త్రి సభ్య కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమంచినది.

       

గడువు :-  8 వారాలు. వివిధ రాజకీయ పార్టీలకు లేఖలు వ్రాయటం, అభిప్రాయం తీసుకోవటం. చర్చించటం, సంప్రదించటం,  ముఖ్యమైనవి.  

        

        అధ్యక్షులు :- ప్రణబ్ ముఖర్జీ 

        సభ్యులు     :-  రఘువంశ్ ప్రసాద్ సింగ్ 

                             :-  దయానిధి  మారన్ 

21). గంగోపాధ్యాయ కమిటీ

ప్రభుత్వ వ్యయం తగ్గించటానికి మరియు సూచనలు , సలహాలు చేయటానికి ఈ కమిటీ ని నియమించారు.

22). రోశయ్య  కమిటీ (2009 )

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై అభిప్రాయాలను సేకరించటానికి ఈ కమిటీ ని వై .ఎస్ . రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.

    

        అధ్యక్షులు   :-       రోశయ్య 

       సభ్యులు     :-      ఉత్తమ్ కుమార్ రెడ్డి 

                                 గీతా రెడ్డి 

                                  డి. శ్రీధర్ బాబు 

                                షేక్ హుస్సేన్ 

                                     ఆర్. పద్మ రాజు 

                                     కొణతాల రామకృష్ణ 

                                     అక్బరుద్దీన్ ఒవైసి 

23). శ్రీ కృష్ణ కమిటీ  ( 2010 ఫిబ్రవరి 03)

తెలంగాణ, సమైక్యాంద్ర  ఉద్యమ పోరాటాలలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేయటానికి మరియు సాదారణ పరిస్థితులు నెలకొల్పటానికి , సూచనలు, సలహాలు ఇవ్వటానికి కేంద్ర  ప్రభుత్వం  ఈ కమిటీ ని నియమించింది.  


నివేదిక :- 2010 డిసెంబర్ 30.

     

     అధ్యక్షులు   :-      జస్టిస్ శ్రీ కృష్ణ 

      కార్యదర్శి    :-       వి. కె. దుగ్గల్ 

       సభ్యులు    :-       రవీందర్ కౌర్ 

                       :       రణ్ వీర్  సింగ్

                       :        అబూసలె  షరీఫ్ 

24). ఆంటోని కమిటీ (2013 ఆగష్టు 06)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విధివిధానాలను సూచించుటకు  కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది.

 

అధ్యక్షులు :-      ఆంటోని 

 సభ్యులు    :-      దిగ్విజయ్  సింగ్ 

                             వీరప్ప మెయిలీ 

                              అహమద్ పటేల్ 

25). మంత్రుల బృందం ఏర్పాటు  ( జి. వో. ఎం )  ( 2013  అక్టోబర్ 08 )

రాష్ట్ర విభజనకి, రాష్ట్రపార్టీల నుండి  సలహాలు, సూచనలు సేకరించటానికి  ఈ  జి. ఓ .ఎం  ని  ఏర్పాటు చేసినారు. 

    

   ఛైర్మన్ : -   ఏ . కె. ఆంటోని 

       సభ్యులు :-  సుశీల్ కుమార్ షిండే 

                           పి . చిదంబరం 

                           గులాంనబీ  ఆజాద్ 

                           వీరప్ప మొయిలీ 

                          జైరాం రమేష్

స్పెషల్  గెస్ట్ :-  వి. నారాయణ స్వామి 


  మరి కొంత అదనపు సమాచారం 


తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ల లోని అన్ని కమిటీలు మరియు కమీషన్‌లను  ఈ కాలంలో ఏర్పడిన విస్తృతమైన చారిత్రక పరిణామాలు మరియు అనేక అస్తిత్వాలు. అయితే, ఈ సమయంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ల యొక్క సామాజిక-రాజకీయ మరియు ఆర్థిక దృశ్యాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన కొన్ని ముఖ్యమైన కమిటీలు మరియు కమీషన్ల సంక్షిప్త అవలోకనాన్ని వివరించగలను.

1. నిజాం పాలన (1948కి ముందు)

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కమిటీ (HSCC) 

నిజాం పాలనలో ఏర్పడిన ఇది ప్రజాస్వామ్య పాలన కోసం పాటుపడటంలో కీలక పాత్ర పోషించింది.

2. భారతదేశంతో ఏకీకరణ (1948)

శ్రీ బూర్గుల రామకృష్ణారావు కమిటీ (1953): హైదరాబాదును భారతదేశంలో విలీనం చేసే సమస్యను పరిష్కరించడానికి నియమించారు.

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు (1956)

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ (SRC) 

ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకించనప్పటికీ, SRC (1953-1955) రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషించింది. ఇది 1956లో ఆంధ్ర రాష్ట్రం మరియు తెలంగాణల కలయిక ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు దారితీసింది. 

4. ప్రారంభ సమీకృత కాలం (1950-1960లు)

కొచ్చెర్లకోట రంగధామరావు కమిటీ (1956)

 రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయబడింది.

ధార్ కమిషన్ (1961) 

సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించారు.

5. రాజకీయ ఉద్యమాలు మరియు పరిణామాలు

జై ఆంధ్ర ఉద్యమం (1972-1973) 

ఒక కమిటీ కానప్పటికీ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం ముఖ్యమైనది.

మండల్ కమిషన్ (1980)

 జాతీయ కమిటీ అయినప్పటికీ, రిజర్వేషన్లపై దాని సిఫార్సులు ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి.

6. ఆర్థిక ప్రణాళిక మరియు అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా మండలి (1956) 

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక మరియు ప్రోత్సహించడానికి ఏర్పాటు చేయబడింది.

7. భాష మరియు విద్యా కమిటీలు

శుభరాత్రి. రావు కమిటీ (1957)

రాష్ట్రంలో అధికార భాష (తెలుగు) అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.

వెంకటసుభయ్య కమిటీ (1974)

విద్యావ్యవస్థలో భాషా సంబంధిత సమస్యలపై దృష్టి సారించింది.

8. భూ సంస్కరణలు మరియు వ్యవసాయం

చెన్నా రెడ్డి కమిటీ (1972)

వ్యవసాయ సంస్కరణలు మరియు భూ పంపిణీపై దృష్టి సారించింది.

ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల కమిటీ (2005)

భూ పంపిణీ మరియు సంస్కరణలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు.


9. పరిశ్రమ మరియు మౌలిక సదుపాయాలు

పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రోత్సాహంపై కమిటీ (1970లు) 

పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడంలో పాత్ర పోషించింది.


శివరామన్ కమిటీ (1980)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు పునర్నిర్మాణాన్ని పరిశీలించారు.

10. సంక్షేమం మరియు సామాజిక న్యాయం

బల్వంతరాయ్ మెహతా కమిటీ (1957) 

పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరును అధ్యయనం చేసింది.

జస్టిస్ వి.భార్గవ కమిషన్ (1986)

 షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలపై జరిగిన అఘాయిత్యాలను పరిశోధించారు.

11. సహజ వనరుల నిర్వహణ

గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (1969)

 ఆంధ్రప్రదేశ్‌తో సహా రాష్ట్రాల మధ్య నీటి-భాగస్వామ్య వివాదాలను పరిష్కరించింది.


కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (1973)

 కృష్ణా నదికి సంబంధించిన నీటి-భాగస్వామ్య సమస్యలను పరిశీలించారు.

12. ఆంధ్రప్రదేశ్ విభజన (2014)

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ (2010) 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను పరిశీలించి, సిఫార్సులు సమర్పించారు.

మంత్రుల బృందం (GoM) 

విభజన నుండి ఉత్పన్నమయ్యే వివిధ సమస్యలను పరిష్కరించడానికి విభజన తర్వాత ఏర్పడింది.

13. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (2014)

జూన్ 02. 2014 న  పది 10 జిల్లాలతో కూడిన నూతన తెలంగాణ రాష్ట్రము  ఏర్పాటు చేయబడినది.  

ముగింపు

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ల రాష్ట్రాల  చరిత్ర సంక్లిష్టమైనది మరియు బహుముఖమైనది, ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక పరిణామాలతో గుర్తించబడింది. విభిన్న సవాళ్లను పరిష్కరించడంలో మరియు రాష్ట్రాల గమనాన్ని రూపొందించడంలో వివిధ కమిటీలు మరియు కమిషన్‌లు కీలక పాత్రలు పోషించాయి. 






Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.